*📚✍ఉపాధ్యాయుల సహకారం అభినందనీయం*
*♦జిల్లా కలెక్టర్ ఇంతియాజ్*
*🌻గాంధీనగర్ (విజయవాడ), న్యూస్టుడే :* ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేసి ప్రజలను చైతన్యపరచడానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పి.ఆర్.టి.యు) కృష్ణా జిల్లా శాఖ అధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్లోని ఓ హోటల్లో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉందని, జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించి ఈ-హాజరు, డిజిటల్ తరగతుల నిర్వహణలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి పలు పురస్కారాలు అందుకున్న డీఈవో ఎం.రాజ్యలక్ష్మిని కలెక్టర్ ఇంతియాజ్, ఉపాధ్యాయులు, సంఘం నాయకులు సత్కరించారు. అనంతరం జూట్ బ్యాగులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యు. జిల్లా అధ్యక్షుడు డి.శ్రీను, ప్రధాన కార్యదర్శి జి.వి.ఎస్.పెరుమాళ్ల తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
No comments:
Post a Comment