Blog Archive

Saturday, 4 January 2020

పాఠశాల విద్యలో సెమిస్టర్‌ విధానం

 *పాఠశాల విద్యలో సెమిస్టర్‌ విధానం*


❇ *జాతీయ విద్యావిధానం-2020 నివేదికలో వెల్లడి*

🌏 *ఈనాడు - అమరావతి*

⬛ *సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని, పాఠశాల విద్యలో సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేయాలని జాతీయ విద్యావిధానం-2020 నివేదిక సూచించింది. పాఠశాల, ఉన్నతవిద్య ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను 60 పేజీల నివేదిక పేర్కొంది.*

⬛ *పూర్వప్రాథమిక విద్యలో నాణ్యత ఉండటం లేదని, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. చాలామంది విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం రావడం లేదని, చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.*


 *5+3+3+4 విధానం*

పాఠశాల విద్యలో 5+3+3+4 విధానం అమలు చేయాలి. ఐదేళ్లలో మొదటి మూడేళ్లు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు 1, 2 తరగతులు, తర్వాత మూడేళ్లలో 3-5 తరగతులు, అనంతరం మూడేళ్లు 6-8 తరగతులు, నాలుగేళ్లలో ఉన్నత పాఠశాల 9-12 తరగతులు ఉంటాయి. మొదటి ఐదేళ్ల పునాది స్థాయిలో విద్యార్థులకు మంచి ప్రవర్తన, నైతికత, వ్యక్తిగత పరిశుభ్రత, బృందంగా, పరస్పర సహకార విధానం బోధించాలి.

 *2035 నాటికి 100 శాతం ప్రవేశాలు*

ప్రస్తుతం విద్యార్థుల ప్రవేశాల నిష్పత్తి 6-8 తరగతుల్లో 90.7%, 9-10లో 79.3%, 11-12 తరగతుల్లో 51.3%. ఈ గణాంకాల ప్రకారం ఎనిమిదో తరగతి తర్వాత బడి మానేస్తున్న వారి సంఖ్య అధికం. వీరిని మళ్లీ బడికి తీసుకొచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలి.  పూర్వప్రాథమిక విద్యలో 2035 నాటికి 100% స్థూల ప్రవేశాల నిష్పత్తి ఉండాలి.


*నాలుగేళ్ల డిగ్రీలో వెసులుబాటు*

⬛ *ఉన్నత విద్యాసంస్థలు నాలుగేళ్ల డిగ్రీలను ఆహ్వానించాలని సూచించింది. విద్యార్థులు ఎప్పుడైనా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది. మొదటి ఏడాది వెళ్లిపోతే డిప్లొమా అర్హత ధ్రువపత్రం, మూడేళ్లకు బయటకు వెళ్తే డిగ్రీ ఇవ్వాలని వెల్లడించింది.*

⬛ *ఆర్థిక సమస్యలతో ఏ విద్యార్థీ ఉన్నతవిద్యకు దూరం కాకూడదు. జాతీయ ఉపకార వేతనాన్ని మరింత విస్తరించాలి. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు ఉపకార వేతనాలను అందించాలి. ఉన్నతవిద్యలో ప్రవేశాల నిష్పత్తి 2018లో జాతీయ సరాసరి 26.3% ఉంది. ఇది 2030 నాటికి 50% చేరాలి.*

⬛ *2040 నాటికి డిగ్రీ కళాశాలలు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలుగా, విశ్వవిద్యాలయాలు... పరిశోధన వర్సిటీలు, బోధన వర్సిటీలుగా మారాలి.*

 *నాణ్యతలేని బీఈడీ విద్యాసంస్థల మూత*

🔷 *ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరగాలని, నాణ్యతలేని వాటిని వీలైనంతవరకు మూసివేయాలని నివేదిక సూచించింది.*

🔷 *కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 30:1, సామాజిక వెనుకబడిన ప్రాంతాల్లో 25:1 తప్పనిసరి.*

🔷 *2030 నాటికి నాలుగేళ్ల సమీకృత డిగ్రీ+ బీఈడీ కోర్సు అర్హతగా ఉండాలి. విద్యా సంస్థలు బహుళ బీఈడీ కోర్సులను నిర్వహించాలి.*

🔷 *నాణ్యతలేని ఉపాధ్యాయ విద్యాసంస్థలను మూసివేయాలి.*

🔷  *ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ, అంచనా, అక్రిడిటేషన్‌ అవసరం* 

🔷 *వెనుకబడిన, అణగారిన వర్గాలకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఉన్నత ప్రమాణాలతో కూడిన పూర్వప్రాథమిక విద్యను అందించాలి*. 

🔷 *జాతీయ ఓపెన్‌ స్కూల్‌(ఎన్‌ఐవోఎస్‌)లో సార్వత్రిక, దూరవిద్య కోర్సులను మరింత పెంచాలి.*


No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...