మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? అయితే వెంటనే మీ వివరాలు బ్యాంకులో అప్డేట్ చేయించాలి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయనివారికి ఎస్బీఐ నోటీసు జారీ చేసింది. బ్యాంకు లావాదేవీల్లో అవాంతరాలు రాకుండా ఉండాలంటే కస్టమర్లు వెంటనే కేవైసీ పూర్తి చేయాలని కోరుతోంది. ఇందుకోసం 2020 ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చింది. "కేవైసీ వివరాలు లేనివారు 2020 ఫిబ్రవరి 28 తేదీ లోగా అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించకపోతే వారి అకౌంట్లను బ్యాంకు ఫ్రీజ్ చేయొచ్చు" అన్నది ఆ నోటీసు సారాంశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI వెబ్సైట్లోని ఉన్న నిబంధనల ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (మెయింటనెన్స్ ఆఫ్ రికార్డ్స్) రూల్స్-2005 ప్రకారం బ్యాంకులు కస్టమర్ల గుర్తింపు విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది.
అందుకే అన్ని బ్యాంకులు 2020 ఫిబ్రవరి 28 లోపు కస్టమర్ల కేవైసీ అప్డేట్ చేయాలి.
మీ కేవైసీ వివరాలు ఇప్పటివరకు అప్డేట్ చేయకపోతే బ్యాంకుకు వెళ్లి మీ ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అందజేయాలి. కస్టమర్లు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయి కొన్ని నిమిషాల్లోనే కేవైసీ అప్డేట్ చేయొచ్చు. మీ పాస్పోర్ట్, ఓటర్ ఐడెంటిటీ

No comments:
Post a Comment